Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్కీ దౌత్యవేత్తకు సమ్మన్లు
- ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయన్న భారత్
న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై జోక్యం చేసు కోవద్దని టర్కీకి భారత్ చురకలంటించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టయితే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని ఘాటుగా హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ టర్కీ దౌత్యవేత్త సాకిర్ ఓజ్కాన్ టోరున్లర్కు సమ్మన్లు జారీ చేశారు. పాక్ పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్..భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ, ఇమ్రాన్ సర్కారుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఎర్డోగన్ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఎర్డోగన్ వ్యాఖ్యలను రవీశ్ కుమార్ తప్పుపట్టారు. 'టర్కీకి భారత చరిత్ర గురించి, దౌత్య విధానాలపై కనీస అవగాహన లేదు' అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు భారత, టర్కీ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని అన్నారు. పాకిస్థాన్ పర్యటనకు విచ్చేసిన టర్కీ అధ్యక్షడు శుక్రవారం పార్లమెంట్ జాయింట్ సెషన్లో మాట్లాడుతూ ప్రస్తుతం కాశ్మీరీల పరిస్థితి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో విదేశీయుల ఆధిపత్యంతో పోరాడిన టర్కీ వాసులలా ఉందని వ్యాఖ్యానించారు.