Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసుల్లో లీ మైంగ్బక్కు 17ఏండ్ల జైలు, జరిమానా
సియోల్ : అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసుల్లో దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు లీ మైంగ్బక్ను సియోల్ హైకోర్టు దోషిగా తేల్చింది. 17ఏండ్ల జైలు, 10.9మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం...లీ మైంగ్బక్ 2008 నుంచి 2015 వరకు దక్షిణకొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేగాకుండా, ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని, సామ్సంగ్ గ్రూపునకు లబ్ది చేకూర్చేందుకు భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించారని ఆరోపిస్తూ సియోల్ పోలీసులు కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసుల్లో దిగువ కోర్టు లీ మైంగ్బక్ను దోషిగా తేల్చింది. ఆయనకు 15ఏండ్ల జైలు శిక్ష విధించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ లీ మైంగ్బక్ సియోల్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈకేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పై ఆదేశాలు జారీ చేసింది. గతేడాది మార్చిలో బెయిల్పై విడుదలైన లీ మైంగ్బక్ను తిరిగి అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని సియోల్ హైకోర్టు ఆదేశించింది.