Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లూమ్బర్గ్ను అమ్మేస్తా...!
- మైఖేల్ బ్లూమ్బర్గ్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వ్యాపార దిగ్గజం మైఖేల్ బ్లూమ్బర్గ్ సంచలన నిర్ణ యం తీసు కున్నారు. ఈఏడా ది నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తనను ధనవంతుడిని చేసిన బ్లూమ్బర్గ్ ఎల్పీ సంస్థను అమ్మేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ముఖ్య సలహాదారుడు టిమ్ ఓబ్రెయిన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని విదేశీ వ్యక్తులు, ప్రయివేట్ ఈక్వీటీ సంస్థలకు అమ్మకూడదని నిర్ణయించుకున్నట్టు టిమ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా ఆర్థికపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా వాటికి వీలైనంత దూరంగా ఉండేందుకే సంస్థను అమ్మనున్నట్టు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ప్రెసిడెంట్ ట్రంప్తో తలపడే డెమోక్రటిక్ అభ్యర్థి కోసం జరిగిన ముందస్తు పోల్స్లో మైఖేల్ బ్లూమ్బర్గ్ అనూహ్యంగా ముందుకొచ్చారు. ఆయన బుధవారం లాస్ వేగాస్లో జరిగిన తన తొలి డిబేట్లో పాల్గొన్నారు. ఆయనకు అనూహ్య ప్రజాధరణ ఉన్నది. నవంబరు 3న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి. మైఖేల్ గతంలో న్యూయార్క్ మేయర్గా పనిచేశారు. 1981లో బ్లూమ్బర్గ్ సంస్థను స్థాపించిన మైఖేల్ బ్లూమ్బెర్గ్ అంచలంచెలుగా వ్యాపారాన్ని వృద్ధి చేసి బిలియనీర్గా అవతరిం చారు.2019లో ఈ సంస్థ 10 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది.