Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలో విజృంభించిన కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం తగ్గింది. కోవిడ్-19 నిర్మూలన కోసం జిన్పింగ్ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కోవిడ్-19 బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించి ప్రత్యేక వార్డుల్లో నిరంతర వైద్య సేవలు అందిస్తున్నది. కోవిడ్-19 సోకిన వారి సంఖ్య బుధవారం గణనీయంగా పడిపోయినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. వైరస్ సోకిన వారి సంఖ్య 74,576కు చేరింది. ఇటీవలి కాలంలో ఒక రోజులో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి అని తెలిపింది. కొవిడ్ మృతుల సంఖ్య 2,118కు చేరింది. కోవిడ్-19 నిర్మూల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.