Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఓ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సిడ్నీ నుంచి మెల్బోర్న్కు 160 మంది ప్రయాణీకులతో బయల్దేరిన మెల్బోర్న్ ఎక్స్ప్రెస్ వాలన్ నగరం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రైలు ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. రైలు పట్టాలు తప్పిన క్రమంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని పూర్తిగా ఆర్పేసినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే రూట్లో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించినట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.