Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా విదేశాంగ మంత్రి
వాషింగ్టన్ : తాలిబన్ ప్రతినిధులకు, అఫ్ఘాన్ అధికారులకు మధ్య చర్చల పునరుద్ధరణ కోసం రంగం సిద్ధం చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఈనెల29న తాలిబన్ ప్రతినిధులకు, అఫ్ఘాన్ అధికారులకు మధ్య చర్చలు తిరిగి ప్రారంభించనున్నట్టు తెలిపారు. కాగా, అఫ్ఘాన్లో కొన్నేండ్ల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న భీకరపోరులో వేలాది మంది సామాన్య పౌరులు మృతిచెందారు. తాలిబన్ల డిమాండ్లపై అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా బలగాలను, పౌరులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు మెరుపుదాడులకు దిగుతున్నారు. అమెరికా సంకీర్ణదళాలు అఫ్ఘాన్ సైన్యానికి సహకరిస్తున్నాయి. ఇరువర్గాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించింది. గతేడాది ఖతార్ రాజధాని దోహా నగరంలో చర్చలు జరిపింది. అయితే, ఓ పక్క చర్చలకు హాజరవుతూనే మరోపక్క తాలిబన్లు కాబూల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. అఫ్ఘాన్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించినట్టయితే పోలింగ్ బూత్లను పేల్చేస్తామని హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇండ్లపై దాడులకు పాల్పడ్డారు. అధ్యక్ష ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిం చారు. కాబూల్ సరిహద్దులో ఇద్దరు అమెరికా సైనికాధికారులను హతమార్చారు. ఈ ఘటనను అమెరికా సీరియస్గా తీసుకుంది. తాలిబన్ ప్రతినిధులకు, అఫ్ఘాన్ సర్కారుకు మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించలేమని చేతులెత్తేసింది. తాలిబన్ల ఏరివేత తప్పదని హెచ్చరించింది. కాగా, చర్చలు ఓ కొలిక్కి వచ్చే సమయంలో అమెరికా వెనుకంజ వేయడంపై విమర్శలు వినిపించాయి. అఫ్ఘాన్ సర్కారుకు, తాలిబన్ ప్రతినిధులకు మధ్య చర్చలు సఫలీకృతం కావొద్దనే దురుద్దేశంతోనే అమెరికా భావించిందనే అను మానాలు వ్యక్త మయ్యాయి. దీంతో, తాలిబన్లు చైనా, రష్యాలను ఆశ్ర యించారు. తాలిబన్లకు, అఫ్ఘాన్ సర్కారుకు మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా ముందు కొచ్చింది. అఫ్ఘాన్లో శాంతి స్థాపన కోసం తామీ బాధ్యత తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల్లో రష్యా, చైనా దేశాలు జోక్యం చేసుకున్నట్టయితే తమకు ప్రమాదమని అమెరికా భావించింది. అఫ్ఘాన్ సర్కారుకు, తాలిబన్ ప్రతినిధుల మధ్య చర్చల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తోంది.