Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మాజీ సలహాదారు రోగర్ స్టోన్కు యూఎస్ జిల్లాకోర్టు 40నెలల శిక్ష విధించింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను గెలిపించడానికి రష్యాతో కలిసి కుట్ర పన్నారని స్టోన్ ఆరో పణలు ఎదుర్కొం టున్నారు. ఈ విషయంపై నమోదైన కేసులో యూఎస్ కాంగ్రెస్ దర్యాప్తును స్టోన్ అడ్డుకున్నట్టు రుజువైనందున కోర్టు తాజా తీర్పును వెలు వరించింది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి స్టోన్ రష్యాతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు డెమోక్రటిక్ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో స్టోన్ సాక్ష్యులను బెదిరించడం, యూఎస్ కాంగ్రెస్కు అసత్యాలు చెప్పడమే కాకుండా హౌస్ దర్యాప్తును అడ్డుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై విచారించి కోర్టు నవంబరులో స్టోన్ను దోషిగా తేల్చింది. ఈ కేసు విషయంలో రాజ కీయ ఒత్తిడిని పెంచేందుకు స్టోన్ చేసిన చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమీ బెర్మాన్ జాక్సన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ గెలుపు కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ సహకరించలేదని రుజువైంది. అయితే, ఈదర్యాప్తుకు సంబంధించి రోగర్ స్టోన్ సహకరించలేదని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆరోపించారు. తాజా కోర్టు తీర్పుపై ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తనకు ఉన్న విశిష్టాధికారాలను ఉపయోగించి రోగర్ స్టోన్ను క్షమిస్తానని చెప్పారు. రోగర్ ఎలాంటి తప్పు చేయలేదని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. త్వరలోనే అన్ని అడ్డంకులనూ తొలగించుకొని స్టోన్ బయటకు వస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకుంటే.. న్యాయస్థానానికే కళంకమని పేర్కొన్నారు. న్యాయస్థానంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రేగింది. గతంలోనూ తన మాజీ ప్రచార బాధ్యుడు పాల్ మునాపోర్టుకు పైరవీ కేసులో జ్యూరీ శిక్ష విధింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.