Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల నుంచి జారీ
లండన్: యూరోపియన్ యూనియన్(బ్రెగ్సిట్) నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తరువాత అనేక అంతర్గత సంస్కరణలకు స్వీకారం చూడుతున్నది. బ్రెగ్జిట్ తర్వాత యూకేకు 11 నెలల ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో యునైటెడ్ కింగ్ డమ్ ఈయూ నిబంధనలను పాటించడంతో పాటు డబ్బులు కూడా చెల్లిస్తుంది. అయితే బ్రిగ్జిట్ నేపథ్యంలో బిట్రన్ తన ఇమ్మిగ్రేషన్ విధానం మార్పులుచేయనున్నది. కొద్దిరోజుల క్రితం పాయింట్స్ బేస్డ్ విధానాన్ని బ్రిటన్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఉన్న మెరూన్ కలర్ పాస్పోర్టుల స్థానంలో నీలిరంగు పాస్లను తీసుకురానున్నది. వచ్చే ఆరు నెలల్లో పాస్పోర్టులను దశలవారీగా మార్పు చేస్తారు. దీనిలో భాగంగా తొలుత వచ్చే నెల మొదటివారంలో నీలిరంగు పాస్పోర్టులను జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 1988లో తొలిసారిగా ఈ పాస్పోర్టులను ప్రవేశపెట్టారు. వీటి ముద్రణను ఫ్రెంచ్ బహుళ జాతి సంస్థ థేల్స్కు ఇచ్చారు. బ్రెగ్సిట్ నుంచి నిష్క్రమించడం ద్వారా జాతి గుర్తింపును పునరుద్దరించడానికి, ప్రపంచంలో మనకు ఒక కొత్త మార్గాన్ని రూపొందించడానికి అవకాశం వచ్చిందని యూకే అంతర్గత వ్యవహరాశాల శాఖ మంత్రి ప్రీతి పటేల్ అన్నారు. జాతీయ గుర్తింపును పునరుద్దరించడంలో భాగంలో ఐకానిక్ బ్లూ అండ్ గోల్డ్ డిజైన్కు తిరిగి వస్తామని బ్రిటన్ 2017లో ప్రకటించడం ఈయూలో అలజడికి కారణమైంది. 1921లో తొలిసారి నీలిరంగు పాస్పోర్ట్ను బ్రిటన్ ముద్రించింది. నాటి నుంచి 1988 వరకు ఇవే చలామణిలో ఉండేవి.