Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలో ఆదివారంకరోనా వైరల్ ఇన్ఫెక్షన్తో 97 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు మరో 650 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయిట్టు వివరించారు. తాజా మృతులతో చైనాలో ఇప్పటి వరకూ ఈ ఇన్ఫెక్షన్తో మొత్తం 2,442 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. తాజా ఇన్ఫెక్షన్లతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 76,936కు చేరినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. తాజా మృతులు, ఇన్ఫెక్షన్లలో అధికశాతం ఈ వైరల్ ఇన్ఫెక్షన్కు కేంద్రంగా మారిన ఉహాన్ నగరంలోనే నమోదయ్యాయని అధికారులు వివరించారు. చైనాతో పాటు ఈ కరోనా వైరస్ ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని మరో 25కు పైగా దేశాలలో విస్తరించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
అతి పెద్ద హెల్త్ ఎమర్జెన్సీ: జిన్పింగ్
ఇప్పటి వరకూ 2,400 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్న ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చరిత్రలోనే అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు. ఆదివారం ఉదయం జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ను అడ్డుకోవటం, అదుపు చేయటం కష్టసాధ్యమవుతోందన్నారు.