Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియమించిన లంక సర్కారు
కొలంబో: గత ఏడాది ఏప్రిల్లో ఈస్టర్ పండుగ రోజు 250 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద దాడిపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని సేకరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయటంతో పాటు బాధ్యులైన వారిని శిక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఉన్నతాధికార సమావేశంలో ఈ దర్యాప్తు బృందం నియామక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ దాడిపై ప్రస్తుతం కొనసాగుతున్న సీిఐడి దర్యాప్తునకు సహకరించేందుకు ఈ ఆరుగురు సభ్యుల టాస్క్ఫోర్స్ను నియమించినట్టు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దర్యాప్తుపై ప్రతివారాంతంలో ఈ కమిటీ తమకు నివేదిక అందచేస్తుందని వివరించింది. ఈ ఉగ్రవాద దాడిపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఐడి దర్యాప్తు సమర్ధవంతంగా కొనసాగనందునే తమ ప్రభుత్వం ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే ఈ ప్రకటనలో వివరించారు.