Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే దశలవారీగా తగ్గుముఖం పడుతుందని 2013లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత, జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనా వేశారు. వేగంగా విస్తరిస్తున్న కోవి డ్-19 వ్యాప్తికి త్వరలోనే తెరపడుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. చైనాలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తగ్గిన తరహాలోనే ప్రపంచ దేశాల్లోనూ కరోనా విస్తృతి మందగిస్తుందని ఆయన తెలిపారు. చైనా తరహా లోనే అమెరికా సైతం త్వరలోనే కరోనా వ్యాప్తి నుంచి విముక్తి పొందుతుందని, ఇది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయం కంటే ముందే జరుగు తుందని లెవిట్ అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచే ఆయన ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను నిశితం గా అథ్యయనం చేస్తున్నారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు భయాందో ళనలను అధిగమించాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు.
మొత్తం కేసుల సంఖ్యను ఆయన పరిగణనలోకి తీసుకోకుండా రోజూ కొత్తగా నమోదయ్యే కేసుల్లో తగ్గుదలను ఆయన ప్రధానంగా పరిశీలిస్తున్నారు. కేసుల సంఖ్య ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నా ఈ వైరస్ వ్యాప్తి బలహీనపడుతున్నదనేందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక దూరం పాటించడం, వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురావడం రెండూ కీలకమని అన్నారు. వైరస్ బాధితులతో ఆస్పత్రులు నిండిపోవడంతో సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ను అడ్డుకోవడం మంచిదని ఆయన సూచించారు.
అతిగా స్పందిస్తే అనర్థం
కరోనా వైరస్ వ్యాప్తిపై అతిగా స్పందించడం మరో సంక్షోభానికి దారితీస్తుందని లెవిట్ ఆందోళన వ్యక్తం చేశారు. అనవసర భయాందోళనలతో నిరుద్యోగానికి దారితీయడం, ఆత్మహత్యలు పెరగ డం వంటి విపరీత ధోరణులు చోటుచేసుకుం టాయని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ మంద గమనం వంటి ప్రతికూల ప్రభావాలనూ తోసిపు చ్చలేమన్నారు. ఫ్లూ కంటే ఈ వైరస్తో మరణాల రేటు ఎక్కువగా ఉన్నా ఇది ప్రపంచ అంతానికి దారితీయదని, వాస్తవ పరిస్థితి చెబుతున్నంత భయానకంగా లేదని లెవిట్ స్పష్టం చేశారు