Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కరోనా దెబ్బతో చితికిపోయిన కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని డెమొక్రాటిక్ సోషలిస్టు సెనెటర్ బెర్నీ శాండర్స్ కోరారు. కరోనావైరస్పై గురువారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'చరిత్రలో ఇదొక అసాధారణ మైన పరిస్థితి. దీనికి మన స్పందన కూడా అంతే అసాధారణమైన రీతిలో ఉండాలి.' అని చెప్పారు. ఎవరినీ గాలికొదిలేయబోమని ప్రతి అమెరికన్కు మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు అతి ముఖ్యమైన ఆరోగ్య భద్రత, ఆహారం, వసతి కల్పించాలని ఆయన కోరారు.