Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 నగరాల్లో నిరసనలు..
- కరోనా వైరస్లోనూ పని వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన..
బ్రాసిలియా: బ్రెజిల్లోని 11 నగరాల్లోని కాల్ సెంటర్ ఉద్యోగులు రోడ్డుకెక్కారు. ఇటలీకి చెందిన అలమావివా కు చెందిన కాల్ సెంటర్లో 37 వేల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అంతకు ముందు పాలేర్నియూ లోని కేంద్రంలో 28వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఆ మరుసటి రోజు నుంచి వర్క్ఫ్రం హోమ్కు ఆ సంస్థ అనుమతించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్నా...అలమావివా సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గ దర్శకాలను బేఖాతర్ చేస్తున్నది. తమ సంస్థ శాఖల్లో పని చేయాలని ఒత్తిడి చేస్తున్నది. ఉద్యోగుల ఆరోగ్యం కంటే లాభాలే ప్రధానమన్నట్టుగా వేధింపులకు గురిచేస్తున్నది. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ.. ఉద్యోగులు ధైర్యంతో ముందుకు వచ్చి సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ఈ సమ్మెను విఛ్చిన్నం చేయడానికి సూపర్వైజర్లు, బట్టలు, శ్యానిటైజర్లు ఇచ్చి.. వీటితో మీరు పని చేసే టేబుల్స్, క్యాబిన్స్ను మంచిగా తుడుచుకుని పని చేయాలంటూ యాజమాన్యం కోరుతున్నది. కరోనా వైరస్ మిమ్మల్ని ఏం చేయదు.. అని ఉచిత సలహాలు ఇస్తుంటే.. ఉద్యోగులు వారిని ఎదిరించటానికి వెనుకాడటంలేదు. మీరిచ్చే వస్తువులు.. మాప్రాణాలు కాపాడతాయా అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి నిరసనగా సమ్మెలో భాగస్వాములవుతున్నారు. నయానో భయానో ఉద్యోగులను బెదిరించి బహుళజాతి గుత్తసంస్థలు ఉద్యోగులతో పని చేయించటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి.డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను తుంగలోకి తొక్కటానికి ఆ సంస్థలు యత్నిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.