Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-2008 కంటే దారుణ పరిస్థితులు
- కోలుకోవడానికి వచ్చే ఏడాది కీలకం
- ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐఎంఎఫ్
వాషింగ్టన్: కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం వినాశకరమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నదనీ, స్పష్టం గా మాంద్యంలోకి ప్రవేశిం చిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగి వచ్చే ఏడాది నాటికి అంతర్జాతీయ సమాజంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మీడియాతో మాట్లాడుతూ.. ''2020, 2021 సంవత్సరాలలో వృద్ధి అవకాశాలను తిరిగి అంచనా వేస్తున్నాం. 2008 కంటే దారుణమైన పరిస్థితులు అంతర్జాతీయంగా నెలకొన్నాయి. యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని ఇప్పుడు స్పష్టమైంది. 2021 ఏడాదిలో రికవరీ చాలా కీలకం'' అని అన్నారు. ప్రపంచంలోని అన్ని చోట్ల కరోనా వైరస్ ప్రభావం ఉందని అన్నారు. అభివృద్ధి చెందిన అన్ని ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే అమెరికా సైతం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని చెప్పారు. వైరస్ వ్యాప్తి తగ్గకపోతే ప్రస్తుత పరిస్థితులు మరీ దారుణంగా మారుతాయని అన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పాటు అన్ని స్థాయిల్లో ఉన్న దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం తాము తాజాగా నెలకొన్న అంశాలను పరిగణలోకి తీసుకునీ, వృద్ధి అంచనాలను సవరించే పనిలో ఉన్నామన్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఒత్తిడిలోకి జారుకోకుండా ఉండి, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నియంత్రణ తీసుకురాకపోతే.. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో తిరోగన దిశగ పయనించే అవకాశముందంటూ ఆందోళన వ్యక్త చేశారు. ఆర్థిక స్థిరత్వం కోసం అందరం కలిసి ముందుకు సాగాలని నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కారించడానికి ఆర్థిక, ద్రవ్య వ్యవస్థలపై ప్రభావం పడకుండా ఇప్పటికే పలు దేశాలు చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికీ, కరోనా కట్టడి చర్యలు సంబంధించిన ఉపశమన చర్యలకు అల్పాదాయ దేశాల నుంచి 81 అత్యవసర ఫైనాన్సింగ్ అభ్యర్థనలు వచ్చాయని జార్జివా చెప్పారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మొత్తం ఆర్థిక అవసరాలకు ప్రస్తుత అంచనా ప్రకారం 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరమని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆయా దేశాల స్వంత నిల్వలు, విదేశీ నిల్వలు సరిపోవనే విషయం తమకు తెలుసుననీ, అందరం కలిసి ఆర్థిక స్థిరత్వాని తోడ్పడాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను తక్కువగా అంచనా వేయవద్దంటూ జార్జివా హెచ్చరించారు.