Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : న్యూయార్స్లో కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో వారికి సేవలందిస్తున్న నర్సులకు వ్యక్తిగత రక్షణ పరికరాల పంపిణి జరగడం లేదని వారు నిరసనకు దిగారు. యాజ్ అండ్తో పరికరాలను ఎక్కుసార్లు వాడండని వైద్య అధికారులు ఒత్తిడి చేయాడాన్ని వారు తప్ప పట్టారు మేము మనుషులమే. మేము రక్షణ ఏర్పాట్లు చూసుకుంటూ సేవలు అందిస్తాము. ఇప్పటికే మా సహచరులు ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
'లాభాల కంటే రోగులు ప్రధానం' అనే ప్లకార్డులు పట్టుకుని నర్సులు వారి బంధువులు జకోచ్ మెడికల్ సెంటర్ అవరణలో నిరసనకు దిగారు. న్యూయార్స్లో మెడికల్ సెంటర్ ప్రభుత్వ ఆధ్వార్వంలో నడుస్తున్న పెద్దాస్పత్రి ఇక్కడేనే అత్యధిక మంది రోగులకు కరోనా వైద్యసేవలు అందుతున్నాయి. ఈ సందర్భంలో న్యూయార్క్ మేయర్ స్పందించి ప్రతి నర్సుకు వ్యక్తిగత రక్షణ పరికారాలు అందుబాటులో ఉన్నాయని ప్రకటన చేశారు. కార్మికులు ఆయన ప్రకటన బూటకం అని తిప్పికొట్టారు. ఆయన వచ్చి చూపించమని సవాల్ చేశారు. ఒక ప్రక్క కరోనా పై పోరాడుతూనే తమ రక్షణ కోసం నర్సులు నిరసన పాటిస్తూ వైరస్ బాధితులకు సేవలందిస్తున్నారు.