Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కరోనా వ్యాక్సిన్కు సంబంధించి చైనా నిర్వహించిన ట్రయల్స్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ' ది లాన్సెట్' అనే సుప్రసిద్ధ మెడికల్ జర్నల్ తెలిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని ది లాన్సెట్ తన వెబ్సైట్లో ఉంచింది. వ్యాక్సిన్ ప్రయోగంలో చైనా ఫేజ్ 1 ట్రయల్కు చేరుకోనుందని, ఇది పూర్తిగా సురక్షితమని, కరోనాను సమర్ధవంతంగా తట్టుకోగలదని, మానవుల్లో సార్స్-సిఓవి-2కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఆ అధ్యయనం పేర్కొంది. 108 మంది ఆరోగ్యవంతమైన పెద్దల్లో ఈ ఓపెన్ లేబుల్ ట్రయల్ 28 రోజుల తర్వాత సానుకూల ఫలితాలు కనిపించాయని, తదుపరి ఫలితాలను 6 నెలల తర్వాత మదింపు వేస్తామని లాన్సెట్ ఆ ప్రకటనలో పేర్కొంది. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ ద్వారా రోగ నిరోధక స్పందన సమర్ధవంతంగా ఉంటుందా లేదా అన్న దానిపై తదుపరి ప్రయోగం చేయాల్సి ఉందని అది తెలిపింది.