Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్, చైనాల మధ్య ఉన్న వాస్తవ సరిహద్దురేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రికత్తలు కొనసాగుతు న్నాయి. ప్యాంగ్యాంగ్సో , గాల్వన్ నల్హా, దెమ్చోక్ ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా ఉద్రికత్తంగానే ఉన్నాయ ని, ఆయా పరిస్థితులపై ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని సంబంధిత వర్గాల సమాచారం. సిక్కిం, లఢక్లోని వివాదాస్పద ప్రాంతాలకు అధిక బలగాలను పంపినట్టు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నవరాణే శనివారం లేV్ా కేంద్రంగా ఉన్న 14 క్రాప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తూర్పు లఢక్ ప్రాంతంలో భారత భద్రతా దళాలు పెట్రోలింగ్ నిర్వహించిన తర్వాత కూడా వాస్తవ సరిహద్దు రేఖ వెంబడి చైనాకు చెందిన బలగాలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను దగ్గరిగా పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత అధికారులు పేర్కొన్నారు. ఇటీవల సిక్కిం, లఢక్ సరిహద్దుల్లో ఇరుదేశాల జవాన్ల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే భారత్, చైనాలకు చెందిన కమాండర్లు పలుమార్లు చర్చలు జరిపారు.