Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది మృతి
చికాగో : చికాగోలో మెమోరియల్ డే వీకెండ్లో ఘోర విషాయం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా, 27 మంది గాయాలయ్యాయి. 2015 నుంచి పోల్చుకుంటే ఇది దారుణమైన ఘటన అని స్థానిక మీడియా చికాగో ట్రిబ్యూన్ సోమవారం వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకూ మొత్తం 36 మందిపై కాల్పులు జరిగాయని తెలిపింది. సుదర్ఘ వీకెండ్లో ఇంకా ఒక రోజు మిగిలి ఉందని, కరోనా వైరస్ నేపథ్యంలో ' స్టే ఎట్ హౌం' నిబంధనలు, శనివారం నాటి పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ కాల్పుల సంఖ్య 2019 మొత్తానికి చేరుకుంటోందని పత్రిక పేర్కొంది. 2019లో మెమోరియల్ వీకెండ్లో 43 మందిపై కాల్పులు జరగ్గా, ఏడుగురు మరణించారు. అదేవిధంగా 2016లో 69 మందిపై కాల్పులు జరగ్గా, ఆరుగురు మృతిచెందారు. 2015లో 12 మంది మరణించారని పత్రిక వెల్లడించింది.