Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రెండోసారి తీవ్రత తప్పదు : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : అంటువ్యాధులు దశల వారీగా దాడిచేసా ్తయని, నిబంధనలు వెంటనే సడలిస్తే తక్షణమే కరోనా వైరస్ తారాస్థాయికి వెళ్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. కట్టుదిట్టమైన చర్యల ద్వారా కరోనా వైరస్ను అరికట్టిన దేశాలు...దానిని కొనసాగించాలని సూచించింది. ప్రపంచం ఇంకా వైరస్ మొదటి దశకు మధ్యలోనే ఉందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ మైక్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ...దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.దమొదటి దశ తీవ్రత కొద్దిగా తగ్గిన దేశాల్లో ఏడాదిచివర్లో మళ్లీ దాని ప్రభావం కనిపిస్తుందన్నారు. మొదటి దశ కట్టడికి తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేస్తే మరోసారి వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ''మరోసారి ఎప్పుడైనా ఆ వైరస్ దాడి చేయొచ్చనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు వైరస్ తగ్గుతుందని...మరోసారి రావడానికి నెలలపాటు సమయం ఉంటుందని మనం అంచనావేయలేం. ఈ దశలోనే మరోసారి ఎక్కువ కేసులు నమోదు కావొచ్చు'' అని అన్నారు. తక్షణమే రెండోసారి వైరస్ తారాస్థాయికి చేరదని హామీ ఇవ్వడానికి ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలు ప్రజారోగ్యం, నిఘా చర్యలు, పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను కొనసాగించాలని సూచించారు.