Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కంటికి కనిపించని కరోనా వైరస్..ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 55,88,400 మంది కరోనా బారిన పడగా..3,50,417 మంది మరణించారని జాన్స్హప్క్సిన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫార్ సిస్టమ్స్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్(సీఎస్ఎస్ఈ) నివేదికలో వెల్లడైంది. అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఇలాకా అమెరికాలో కోవిడ్-19తో ప్రాణాలకు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు పైగా నమోదయ్యాయి. ఇక కరోనా బాధితులు 16,80,680కి పెరిగారు. బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్ల్లో 20వేలకు పైగా చనిపోయారని నివేదిక పేర్కొంది.