Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద తొలి భారీ ఎలక్ట్రిక్ విమానం వాషింగ్టన్లో తొలిసారి విజయవంతంగా ఎగిరింది. 'సెస్నా-208 క్యారవాన్' అనే ఈ విమానాన్ని పూర్తి ఎలక్ట్రికల్ ఇంజిన్తో తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చొనే విధంగా అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్ సంస్థ తయారుచేసింది. ఈ విమానం మోసెస్ సరస్సు వద్ద ల్యాండ్ అయ్యే ముందు దాదాపు 30 నిమిషాల పాటు 183 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో ఎగిరిందని మాగ్ని ఎక్స్ తెలిపింది.