Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ, 37 దేశాలు
జూరిచ్ : కరోనాపై పోరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), 37 దేశాలు కూటమి కట్టాయి. కరోనాను ఎదుర్కోనేందుకు కావాల్సిన వైద్య, ఇతర పరికరాలను పరస్పరం పంచుకునేందుకు శుక్రవారం అంగీకారం తెలిపాయి. వ్యాక్సిన్లు, మెడిసిన్, రోగ నిర్ధారణ పరికరాల విషయంలో ఉమ్మడి యాజమాన్యం(కామన్ ఓనర్షిప్)నకు డబ్ల్యూహెచ్ఓ, ఆయా దేశాలు పిలుపునిచ్చాయి. రానున్న కాలంలో పేటెంట్ హక్కుల కారణంగా అత్యవసర పరికరాల సరఫరాకు అడ్డంకులు ఏర్పడాయన్న ఆందోళన ఈ సందర్భంగా వ్యక్తం చేశాయి. కరోనాకు సంబంధించి వ్యాక్సిన్లు, టెస్టులు, నిర్ధారణ పరికరాలు, చికిత్స, ఇతర కీలక పరికరాలు గ్లోబల్ పబ్లిక్ గూడ్స్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని కోస్టారికా అధ్యక్షుడు కార్లోస్ అల్వారాడో తెలిపారు. కరోనా నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం, మేధో సంపత్తిని పంచుకునేందుకు సంబంధించిన ఈ ప్రక్రియ మార్చిలోనే ప్రారంభమైంది. తాజాగా ఏర్పాటైన కూటమిలో ఇతర దేశాలు కూడా స్వచ్ఛందంగా చేరాలని డబ్ల్యూహెచ్ఓ ఈ సందర్భంగా తన భాగస్వామ్య దేశాలకు పిలుపునిచ్చింది. డబ్లూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఆన్లైన్ ప్రెస్ బ్రీఫింగ్లో మాట్లాడుతూ ' కొత్త ఆవిష్కరణలకు ఆజ్యం పోసే సమయంలో పేటెంట్ల పోషించే పాత్రను డబ్ల్యూహెచ్ఓ గుర్తిస్తుంది. కానీ, ఇటువంటి సమయంలో ప్రజలను ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు.