Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లాయిడ్ మరణం తర్వాత ఇది రెండవ ఘటన
మిన్నియాపోలీస్ : అమెరికా పోలీసుల క్రూరత్వానికి బలైన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. మిన్నియాపోలీస్ హైవేపై శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపడుతున్న వేలాది మంది ఆందోళనకారులపై నుంచి ఒక ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రదర్శనకారులు..డ్రైవర్ను ట్రక్ను నుంచి లాగి, దాడి చేశారని అధికారులు చెబుతున్నారు. ఫ్లాయిడ్ మరణాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనకారులపై వాహనాలు దూసుకురావడం ఇది రెండవసారి కావడం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని మిన్నిసోటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ(ఎంఎన్డీపీఎస్) ట్వీట్ చేసింది. కొద్ది సేపటికి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని..ట్రక్ డ్రైవర్ను అరెస్టు చేసి.. దాడిలో గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిచినట్టు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కటి నెట్టింట్లో దర్శనమిస్తోంది. అందులో ఆ హైవేపై నిరసనలు చేపడుతున్న వేలాది మందిపై ఒక్కసారిగా ఓహియోకు చెందిన ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ కెనాన్ అడ్వాంటెజ్ గ్రూప్ లోగో ఉన్న ట్యాంక్ ట్రక్కు దూసుకురాగా... ఆందోళనకారులు దూరంగా పరిగెత్తారు. కొంత దూరం వెళ్లిన ఆ వాహనం అక్కడే ఆగిపోయింది. అయితే ఈ ఘటనపై మిన్నిసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందింస్తూ ఈ డ్రైవర్ ఉద్దేశం ఏమిటో తెలియదంటూ సెలవిచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..విచారణ జరపనున్నట్టు ఎంఎన్డీపీఎస్ వెల్లడించింది.