Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-30 మంది మృతి,పలువురు గల్లంతు
ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బురిగంగ నదిలో రెండు బోట్లు పరస్పరం ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బోటు నీట మునగడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారని రెస్క్యూ అధికారులు తెలిపారు.
మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. 50 మంది ప్రయాణికులతో ముందుగా వెళ్తున్న మార్నింగ్ బర్డ్ బోటును మరో ప్రయాణికుల బోటు వెనుక నుంచి ఢకొీట్టిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 23 మంది మృతదేహాలను గుర్తించామని, మిగతా వారి ఆచూకీ కోసం సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినట్లు విపత్తు సహాయక సిబ్బంది అధికారి ఎనాయత్ హుస్సేన్ తెలిపారు. ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే 100 మంది ప్రయాణీకులతో వెళుతుందని ఈ ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి వెల్లడించారు.
సెంట్రల్ మున్షిగంజ్ జిల్లా నుంచి బయలు దేరిన ఈ బోటు ఢాకా ప్రధాన ఓడరేవు అయిన సదార్గత్లోని సమీపంలోని ఫరాస్గంజ్ వద్ద సోమవారం ఉదయం 9.30 గంటలకు నీట మునిగిందని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆథారిటీ(బీఐడబ్య్లూటీఏ) చీఫ్ కమోడోర్ గోలం సదేఖ్ మాట్లాడుతూ సింగిల్ డెక్ ఉన్న బోటులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోయినప్పటికీ.. అజాగ్రత్త వల్ల మునిగిపోయిందని అన్నారు. సెప్టెంబర్ వరకు ప్రయాణీకులు తీసుకెళ్లేందుకు ఈ బోటుకు అనుమతి ఉందని చెప్పారు. చాలా మంది బోటు క్యాబిన్లో చిక్కుకుపోయారని స్థానికులు మీడియాతో పేర్కొన్నారు. 12-15 మీటర్ల లోతులో మునిగిన బోటు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు డైవర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న పడవను బయటకు తీసేందుకు మరో బోటును వినియోగించనున్నట్టు తెలిపారు.