Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-9మంది మృతి
ఇస్లామాబాద్ : కరాచీ నగరంలోని పాకిస్థాన్ స్టాక్ మార్కెట్(పీఎస్ఎక్స్) భవనంపై సోమవారం ఉదయం ఉగ్ర వాదులు దాడికి దిగారు. ఈఘటనలో మొత్తం 9మంది మృతిచెందినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరిలో నలుగురు భద్రతాసిబ్బందికాగా, ఒక ఎస్సై ఉన్నట్టు సమాచారం. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల దగ్గర్నుంచి ఏ.కే.47 తుపాకులు, పెద్దమొత్తంలో గ్రెనెడ్లు లభ్యమయ్యా యని, దీనిని బట్టి వారు భవనాన్ని చిన్నాభిన్నం చేసి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరపడానికి వ్యూహం పన్నినట్టు తెలుస్తున్నదని భద్రతా బలగాల ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో భవనంలోపల పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తున్నది.
దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సిబ్బందిని ఖాళీ చేయించారు. ఓ కారులో వచ్చిన నలుగురు దుండగుల పార్కింగ్ ఏరియా నుంచి లోపలికి ప్రవేశించినట్టు పీఎస్ ఎక్స్ డైరెక్టర్ అబిద్ అలీ హబీబ్ తెలిపారు. తొలుత భవన ప్రధాన ద్వారా వద్ద గ్రెనెడ్ విసిరినట్టు వెల్లడించారు. అనంతరం లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డట్టు పేర్కొన్నారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాల్లో బ్యాంకులు, పలు ప్రయివేటు సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానం తో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు సైనిక, అధికార వర్గాలు వెల్లడించాయి.
దాడి మేమే చేశాం : బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
స్టాక్ మార్కెట్పై జరిగిన ఉగ్రదాడి తమ పనే అంటూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)తెలిపింది. బీఎల్ఏకు చెందిన ఆత్మాహుతి దళం 'మాజిద్బ్రిగేడ్' ఈదాడిలో పాల్గొన్నట్టు ప్రకటించింది. మృతి చెం దిన ఉగ్రవాదులను తస్లీమ్బలోచ్, షెV్ాజాద్ బలోచ్, సల్మాన్హమ్మల్, సిరాజ్ కుంగూర్గా గుర్తించారు. ఈదాడిపై పాక్ సైన్యం స్పందిస్తూ, విదేశీఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.