Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు కరోనా రోగులు మృతి
కైరో : ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలోని ఒక ప్రయివేటు ఆస్పతిలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో కరోనా వార్డుగా ఉన్న అత్యవసర విభాగం(ఐసీయూ)లో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు కరోనా రోగులు మరణించారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు ఫ్రభుత్వ న్యాయవాది మహ్మద్- ఇల్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని పౌర రక్షణ శాఖ పేర్కొంది. అయితే రూమ్లోని ఎయిర్ కండిషనర్(ఏసీ) నుంచి మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని షరీఫ్ చెప్పారు.