Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ధ్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఏర్పరిచే కృత్తిమ అడ్డంకులు భారత ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. సరిహద్దు ప్రాంతంతో శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. భారత్లో చైనా వ్యాపార హక్కులను కొనసాగించేందకు చైనా తగిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జువో లిజియాన్ పేర్కొన్నారు. చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రతకు భంగం కలుగుతోందని భారత ప్రభుత్వం ఇటీవల చైనాకు చెందిన 59 యాప్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా లఢక్లో పర్యటించిన నేపథ్యంలో లిజియాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ దేశానికి చెందిన యాప్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం అనేది ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ) నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఇప్పటికే చెనా పేర్కొంది.
సవరించుకుంటుందని ఆశిస్తున్నాం
మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తమ కంపెనీల కార్యకలాపాలకు భారత్ అంతరాయం కల్పిస్తోందని చైనా వాణిజ్య శాఖకు చెందిన అధికార ప్రతినిధి గ్యాంగ్ ఫెంగ్ గురువారం పేర్కొన్నారు. భారత దేశ చర్యలకు ప్రతిస్పందనగా చైనా ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదని, పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే అది ఇరుదేశాలకు ప్రయోజనకరమని అన్నారు. చైనా, చైనా సంస్థలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను భారత్ వెంటనే సవరించుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.