Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిక్కు యాత్రికుల బస్సును ఢకొీన్న రైలు
- 20 మంది మృతి...!
ఇస్లామాబాద్ : పాకిస్తాలో ఘోర ప్రమాదం జరిగింది. షేక్పుర సమీపాన బస్సును రైలు ఢ కొట్టడంతో సుమారు 20 మంది మృతి చెందారని సమాచారం. వీరిలో అత్యధికంగా పెషావర్కు చెందిన సిక్కు యాత్రికులని తెలుస్తోంది. నంకన సాహిబ్ను సందర్శించి తిరిగి పెషావర్కు వెళ్తున్న బస్సును కరాచీ వెళుతున్న షా హుస్సేన్ ఎక్స్ప్రెస్ ఓ రైల్వే క్రాసింగ్ వద్ద బలంగా ఢ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ బస్సులో 25-27 మంది ప్రయాణీకులున్నారని పోలీసులు చెబుతున్నారు. రైల్వే, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను షేక్పుర ఆసుపత్రికి తరలించారని పాకిస్తాన్ రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాదం జరిగిన క్రాసింగ్ గేట్ మూసివేసినప్పటికీ, అయితే రైలు డ్రైవర్ అక్కడ వేచి ఉండడానికి బదులుగా షార్ట్కర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్దార్ అమీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..మృతులంతా మూడు..నాలుగు కుటుంబాలకు చెందినవారేనన్నారు. సిక్కు యాత్రికుల మృతిపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.