Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా: కరోనా మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది చైనాలోని తమ కార్యాలయమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 31వ తేదీన వుహాన్ నగరంలో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో మొదట కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం తెలిపిందని డబ్ల్యూ హెచ్ఓ పేర్కొంది. కరోనా వైరస్ గురించి డబ్ల్యు హెచ్ఒ వెల్లడించిన క్రోనాలజీలో తాజా వివరాలను ప్రకటించింది. వైరల్ న్యుమోనియా కేసులను గుర్తించినట్టు వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్సైట్లో డిసెంబరు 31న ప్రకటించిన తర్వాత చైనాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చిందని పేర్కొంది. అలాగే అదే రోజు, వుహాన్లో నమోదవుతున్న అంతుచిక్కని న్యూమోని యా తరహా కొత్త కేసుల నివేదికను పరిగణలోకి తీసుకుని కొత్త రకం వైరస్ కేసుల గురించి అమెరి కాలోని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎపీడీమీ యోలాజికల్ నిఘా నెట్వర్క్ ప్రోమెడ్ సమాచారం కోరిందని తెలిపింది. ఈ ఏడాది జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరితే, జనవరి 3న సమాచారం అందించారని వెల్లడించింది. దీనిపై డబ్ల్యూహెచ్ఒ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక సంఘటనను అధికారికంగా ధ్రువీకరించడానికి, దాని స్వభావం లేదా కారణం గురించి అదనపు సమాచారాన్ని ప్రకటించడానికి దేశాలకు 24 నుండి 48 గంటల సమయం ఉంటుందన్నారు. తమ నివేది కను ధ్రువీకరించమని కోరిన వెంటనే చైనా అధికా రులు డబ్ల్యూహెచ్ఓను సంప్రదించారని ర్యాన్ తెలి పారు. చైనా పట్ల తమకు ఎలాంటి పక్షపాత ధోరణి లేదని డబ్ల్యూహెచ్ఓ మరోసారి స్పష్టం చేసింది.