Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధారాలున్నాయి : శాస్రవేత్తల బందం
న్యూయార్క్ : ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తిస్తున్నదని 32 దేశాలకు చెందిన శాస్రవేత్తల బందం ఒకటి తెలిపింది. కొద్దికాలంగా ఇదే విషయమై పలువురు వైద్య, ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఇందుకు తగిన ఆధారాలున్నాయనీ ఆ బందం పేర్కొంది. ఈ వాదనను బలపరుస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్బంగా ఆ సంస్థకు లేఖ రాసింది. ఇందులో భాగంగానే ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో రెస్టారెంట్లు, హౌటళ్లు, మాల్స్ భారీగా తెరిచిన నేపథ్యంలో అక్కడికి వస్తున్న ప్రజలు నిబంధనలు పాటించకపోవడం కారణంగానే వాళ్ళలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నదని పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 'గాలిలో ఉండే అతిచిన్న కణాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇందుకు తగిన ఆధారాలున్నాయి. వాటికి సంబంధించిన అధ్యాయాన్ని వచ్చేవారం ఒక ప్రముఖ జర్నల్ లో ప్రచురిస్తాం' అని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్రవేత్తల బందం తెలిపింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాపిస్తుందని ఇన్నాళ్ల నుంచి డబ్ల్యూహెచ్ఓ చెబుతుండగా.. కరోనా బాధితులు తుమ్మినప్పుడు గాని దగ్గినప్పుడు గాని వెలువడే తుంపర్లు నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ ఆ ప్రాంతంలో వైరస్ ను వ్యాపింపజేస్తాయని శాస్రవేత్తల బందం ఆరోపిస్తున్నది. అయితే దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఈ బందం వాదనే నిజమైతే ప్రపంచం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.