Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీల కీలక హోదాల్లో 58 మంది
- 11 దేశాల్లో 36 లక్షల మంది ఉద్యోగులు
- రూ.70 లక్షల కోట్ల రెవెన్యూ
వాషింగ్టన్ : ప్రపంచ వాణిజ్యంలో ప్రవాస భారత ఎగ్జిక్యూటివ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. అమెరికా, కెనడా, సింగపూర్ తదితర 11 దేశాల్లోని దిగ్గజ కంపెనీల్లో 58 మంది సారథులుగా పని చేస్తున్నారు. వారి కింద దాదాపుగా 36 లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఆయా కంపెనీల రెవెన్యూ ఏడాదికి రూ.70 లక్షల కోట్ల పైమాటే. వాటి మార్కెట్ కాపిటలైజేషన్ రూ.280 లక్షల కోట్లు (4 ట్రిలియన్ డాలర్స్)గా ఉంటుందని అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న లాభాపేక్ష లేని సంస్థ ఇండియన్ డయాపోరా ఆర్గనైజేషన్ ఓ రిపోర్ట్లో వెల్లడించింది. దీని ప్రకారం.. భారత సంతతికి చెందిన వ్యాపార లీడర్లు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా కార్పొరేట్ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. వీరి నాయకత్వంలో ఆయా కంపెనీలు 23 శాతం రాబడులను పొందుతున్నాయి. ఎస్అండ్పి 500లో 10 శాతం మంచి ప్రగతిని కనబర్చుతున్నాయి. ఆయా కంపెనీల్లో ప్రపంచ వ్యాప్తంగా 36 లక్షల మంది పని చేస్తున్నారు. భారత నాయకత్వపు సంఖ్య మరింత పెరగాలని ఇండియాస్పొర వ్యవస్థాపకులు ఎంఆర్ రంగస్వామి పేర్కొన్నారు. 58 మందిలో ఐదుగురు మహిళ సారథులు కూడా ఉన్నారు. గూగుల్ మాత్ర సంస్థ అల్పాబెట్ సిఇఒ సుందర్ పిచారుకు సిఇఒగా ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా మాస్టర్ కార్డ్ సిఇఒ, ప్రెసిడెంట్ గా అజరు బంగా, ఐబిఎం గ్రూపు సిఇఒగా అర్వింద్ క్రిష్ణ, మైక్రోసాప్ట్ సిఇఒగా సత్యా నాదేళ్ల, అడాబ్ ఐఎన్సికి శాంతను నారాయెన్, అరిస్టా నెట్వర్స్ సారథిగా జయశ్రీ ఉల్లాయి, నోకియా సిఇఒగా రాజీవ్ సూరీ తదితరులు పని చేస్తున్న విషయం తెలిసిందే.