Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : కోవిడ్-91పై దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ఇద్దరు నిపుణులు చైనాలో పర్యటించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి మూలాన్ని పరిశోధించడానికి ఒక పెద్ద మిషన్ కోసం పునాది వేసే క్రమంలో ఈ వారంతంలో వీరి పర్యటన సాగనుంది. మేలో జరిగిన ప్రపంచ హెల్త్ అసెంబ్లీలో వైరస్ మూలాలపై దర్యాప్తు కోసం 120కు పైగా దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపధ్యంలోనే శని, ఆదివారాల్లో డబ్ల్యూహెచ్ఓ నిపుణులు చైనాలో పర్యటించనున్నారు. నిపుణుల్లో ఒకరు జంతువుల ఆరోగ్య నిపుణులు కాగా, మరోకరు అంటురోగ విజ్ఞాన నిపుణులు. వ్యాధులు జంతువుల నుంచి మానవులకు ఎలా సక్రమింస్తుందో తెలుసుకోవడానికి ఉద్దేశించిన భవిష్యత్ మిషన్ యొక్క పరిధిని, నిబంధనలను ఏర్పరచడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
గబ్బిలాల నుంచి కరోనా వైరస్ ఉద్భవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సివెట్ పిల్ల లేదా, పాంగోలియన్ వంటి క్షీరదాల ద్వారా అది మానవులకు సోకి ఉంటుందని చెబుతున్నారు. భవిష్యత్లో ఇలాంటి సంభవించకుండా వన్యప్రాణుల వ్యాపారాన్ని చైనా ఇప్పటికే నిలిపివేసింది.
ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న మిషన్ రాజకీయంగా చాలా సున్నితమైంది. చైనాకు అనుకూలంగా ఉందనే ఆరోపణలతో డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగనుంది. సంస్థకు ఎక్కువ నిధులు అమెరికా నుంచే వస్తాయనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్కు ఉద్దేశించిన డబ్ల్యూహెచ్ఓ మిషన్ ఫిబ్రవరిలో చివరిసారిగా చైనాలో జరిగింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన కెనడా డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ కరోనా వైరస్ నియంత్రణలో చైనా ప్రయత్నాలను, సమాచారం పంచుకోవడాన్ని ప్రశంసించారు.