Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్గ్రేడ్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన్ లాక్డౌన్ సెర్చియాలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా దాదాపు 10 వేల మంది ప్రజలు రాజధాని బెల్గ్రేడ్లోని పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు. లాక్డౌన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంత మంది ఆందోళనకారులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో గుమిగూడిన ప్రజలను చెరదగొట్టేందుకు పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జి చేశారు. ఆందోళనకారుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో వైరస్ ఉనికి ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో కేసులు రావడం ఇదే తొలిసారి అని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా 300 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 13 మంది మరణించారు. ఈ నేపథ్యంలో తిరిగి లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ఆధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిక్ గురువారం ప్రకటించారు. ఈ లాక్డౌన్ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని, వారాంతం వరకూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.