Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయు కౌన్సిల్ అధ్యక్షుడు మిచెల్ ప్రతిపాదన
బ్రస్సెల్స్ : బ్రెగ్జిట్ కారణంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలపై కలిగే ఊహించని పరిణామాలను ఎదుర్కొనేందుకు రిజర్వ్ ఫండ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈయు కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ పేర్కొన్నారు. ఇందుకుగానూ ఆయన 570 కోట్ల డాలర్లతో బ్రెగ్జిట్ అత్యవసర నిధిని ఏర్పాటును ప్రతిపాదించారు. 2021-27 దీర్ఘకాలిక యూరోపియన్ యూనియన్ బడ్జెట్కు సంబంధించి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ' బ్రెగ్జిట్ అనేది మనకందరికీ సవాలుగా ఉంది. అందువలనే ఈ బ్రెగ్జిట్ రిజర్వ్ నిధిని మేం ప్రతిపాదిస్తున్నాం' అని పేర్కొన్నారు. వచ్చే వారం జరగనున్న కూటమి దేశాల సమావేశంలో మిచెల్ ప్రతిపాదన చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు సంబంధాలపై ఒప్పందం లేదా ఒప్పందం లేకుండా ఉండే బ్రెగ్జిట్ అనేది ఈయు సభ్యదేశాలపై ప్రభావం చూపుతుందని మిచెల్ అన్నారు. దీని దృష్ట్యా 2021, నవంబర్లోపు తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధంగా ఉండాలని కమిషన్ను కోరడం అవసరమని అనుకుంటున్నానని పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాలకు సంబంధించి ప్రస్తుతం ఈయు, బ్రిటన్ మధ్య జరుగుతున్న చర్చలు అంత సులభం కాదన్న విషయం మనకందరికీ తెలుసనని వ్యాఖ్యానించారు.