Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్కు ఉత్తర కొరియా హెచ్చరిక
ప్యోంగ్యాంగ్ : అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ 'నీచమైన రాజకీయ పథకం'లో భాగంగా తమ మంత్రులపై విధించిన ఆంక్షలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్ను ఉత్తర కొరియా హెచ్చరించింది. అమెరికా తోలుబోమ్మగా బ్రిటన్ను అభివర్ణించింది. 'అమెరికా తోలుబోమ్మ బ్రిటన్ ఆంక్షలు విధించడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది' అని ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ప్రభుత్వ అధికార వార్తా సంస్థ కెసిఎన్ఎతో తెలిపారు. ఉత్తర కొరియా జైల్లలో ఖైదీల హత్య, హింస, బలవంతపు శ్రమ వంటి ఆరోపణలతో ఉత్తరకొరియా ప్రజా భద్రతా మంత్రులపై సోమవారం బ్రిటన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలను కొరియా ప్రతినిధి తీవ్రంగా ఖండిచారు. ఉత్తరకొరియాపై అమెరికా శత్రు విధానాన్ని అనుసరిస్తూ, నీచ రాజకీయ పథకంలో భాగంగా బ్రిటన్ను ఈ ఆంక్షలు విధించిందని విమర్శించారు. ఆంక్షలను అమెరికా స్వాగతించడమే ఇందుకు సాక్ష్యమని అన్నారు. ఈ ఆంక్షలను 'తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా జోక్యం చేసుకోవడం'గా ఆయన పేర్కొన్నారు. అమెరికాను గుడ్డిగా అనుసరించకూడదని హెచ్చరించారు.