Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 మందికి గాయాలు
శాన్డియాగో : కాలిఫోర్నియాలోని శాన్డియాగో నావికాస్థావరంలో నిలిపి వున్న అమెరికా యుద్ధ నౌకలో పేలుడు సంభవించడంతో 21మందికి గాయాలయ్యాయని సైనిక అధికారులు తెలిపారు. యూఎస్ఎస్ బోన్హోమ్ రిచర్డ్లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అన్నారు. పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని మిలటరీ అధికారులు తెలిపారు. ఆ సమయంలో నౌకలో 160 మంది సిబ్బంది, అధికారులు నౌకలో ఉన్నారని చెప్పారు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయనీ, గాయపడిన 17మందిని ఆస్పత్రికి తరలించినట్టు అధికార ప్రతినిధి మైక్రానీ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.