Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాకు చెందిన క్యాన్సినో
బీజింగ్ : ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్కు సంబంధించి విదేశాల్లో ఫేజ్-3 ట్రయల్స్ ప్రారంభించేందుకు చర్చలు చేస్తున్నట్టు చైనాకు చెందిన వ్యాక్సిన్ డెవలపర్ క్యాన్సినో బయోలాజిక్స్ సహ వ్యవస్థాపకుడు కియూ డోంగ్స్యూ శనివారం చెప్పారు. ఇందుకుగానూ రష్యా, బ్రెజిల్, చిలీ, సౌదీ అరేబియా దేశాలతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. తూర్పు చైనాలోని సుజోహు నగరంలో సోమవారం నిర్వహించిన యాంటీ వైరల్ డ్రగ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అతి త్వరలోనే ఫేజ్-3 ట్రయల్స్ ప్రారంభ మౌతాయని అన్నారు. ఈ పరీక్షలకుగానూ తమ కంపెనీ 40 వేల మందిని నియమించుకుంటుందని తెలిపారు. ఫేజ్-2 ట్రయల్స్కు 508 మందిని తీసుకున్నామని, ఫేజ్-1 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. భద్రతపరంగా, రోగ నిరోధక శక్తి స్పందన పరంగా మంచి ఫలితాలు కనిపించాయన్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే చైనాలో మానవ పరీక్షల దశకు చేరిన తొలి వ్యాక్సిన్గా ఇది నిలిచింది. కానీ, ట్రయల్స్ పురోగతిపరంగా ఇతర వ్యాక్సిన్ల కన్నా కొంత వెనుక నడుస్తోంది. శినోవ్యాక్ బయోటెక్, చైనా నేషనల్ ఫార్మాసుటికల్ గ్రూప్(సినోఫార్మ్) సంస్థలు తయారు చేసిన ప్రయోగాత్మక వ్యాక్సిన్లు ఇప్పటికే ఫేజ్-3 ట్రయల్స్ను అనుమతి పొందాయి.