Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలిఫోర్నియా : వచ్చే 5-7 సంవత్సరాల్లో భారత్లో దాదాపు రూ.75వేల కోట్ల (10 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టనున్నట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో వర్చువల్ మీటింగ్ అనంతరం గూగుల్ మాతృసంస్థ అల్బాబెట్ సీఈఓ సుందర్ పిచారు ఈ ప్రకటన చేశారు. గూగుల్ ఫర్ ఇండియాలో భాగంగా డిజిటైజేషన్ ఫండ్ రూపంలో ఈ వ్యయం చేయనున్నామన్నారు. ఈక్విటీ వాటాలు, సంస్థల్లో భాగస్వామ్యం, పర్యావరణహిత మౌలిక సదుపాయాల కల్పన తదితర కార్యకలాపాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామన్నారు. వైద్య విద్యా, వ్యవసాయ రంగాల్లో కృత్రిమ ఇంటెలిజెన్సీ, వ్యాపార అభివృద్ధి, భారత్లో ఎన్నడూ లేని సరికొత్త ప్రొడక్ట్ల ఉత్పత్తి, ముఖ్యంగా భారతీయ భాషలపై ముఖ్యంగా దృష్టి సారించనున్నామన్నారు. అనేక విషయాలపై కూలంకషంగా చర్చించామని ఆ తర్వాత మోడీ కూడా ఓ ట్వీట్ చేశారు. ముఖ్యంగా భారతీయ రైతులు, యువతరం, వ్యాపారవేత్తల భవిష్యత్తును మార్చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై పిచారుతో చర్చ జరిగిందన్నారు.