Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షిద్దాం: 80 మంది శతకోటీశ్వరుల పిలుపు
లండన్: కరోనా ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచాన్ని రక్షించేందుకు సంపన్నులపై అధికంగా పన్నులు వేయాలని వివిధ దేశాల ప్రభుత్వాలను సుమారు 80 మంది శతకోటీశ్వరులు కోరారు. మానవత్వం కోసం కోటీశ్వరులు పేరుతో వీరంతా తమపై వెనువెంటనే తగినంతగా, శాశ్వతంగా అధిక పన్నులు వేయాలంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో బెన్ అండ్ జెర్రీ ఐస్క్రీమ్ వ్యవస్థాపకుడు జెర్రీ గ్రీన్ఫీల్డ్, హాలీవుడ్ సినిమాల స్క్రీన్ రైటర్ రిచర్డ్ కుర్టీస్, దర్శకుడు అబిజైల్ డిస్నీ, అమెరికా పారిశ్రామికవేత్త సిడ్నీ టోపోల్, న్యూజిలాండ్ రిటైల్ బిజినెస్మ్యాన్ స్టీఫెన్ టిండల్ ఉన్నారు. ''ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదేస్తున్న ప్రస్తుత తరుణంలో దాన్నుంచి ప్రజలు కొలుకునేందుకు మాలాంటి శతకోటీశ్వరులు కీలక పాత్ర పోషించాల్సి ఉంది'' అని లేఖలో పేర్కొన్నారు. తాము అంబులెన్స్లు నడపలేమనీ, ఇంటింటికి వెళ్లి ఆహార ప్యాకెట్లు అందించలేమని, కానీ తమ వద్ద డబ్బు చాలా ఉన్నదనీ, కరోనా ప్రభావం నుంచి కోలుకోవడానికి డబ్బు చాలా కీలకమనీ, ప్రభుత్వానికి పన్నులు రూపంలో చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే వివిధ దేశాలు కరోనా నష్టాన్ని పూడ్చేందుకు అధిక పన్నులు వేసేందుకు సిద్ధమౌతున్నాయి. అయితే భారత్లోనూ కరోనా విశ్వరూపం చూపుతున్నది. బీజేపీ ప్రభుత్వం పీఎం కేర్తో ఫండ్స్ను పోగేసుకుంటున్నదనీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని నిధి ఉన్నప్పటికీ ఇంకో ఫండ్ ఎందుకని సీపీఐ(ఎం)ప్రధానకార్యదర్శి ఏచూరి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ముకేశ్ అంబానీ లాంటి పెద్దలున్నా..కరోనా కాలంలో తమవంతు సాయం చేయటానికి ముందుకురావటంలేదు. పైగా రిలయన్స్సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలకు కోతపెడుతున్నారని ప్రజాసంఘాలు అంటున్నాయి.