తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచివున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 63,931 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.34,813 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.