Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిన భార్య | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిన భార్య

Sun 04 Dec 08:59:14.956844 2022

హైదరాబాద్: ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చిన భార్య అతడి మరణానికి కారణమైంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతాక్రజ్‌కు చెందిన కవిత-కమల్‌కాంత్ భార్యాభర్తలు. భర్తతో విభేదాల కారణంగా అతడి నుంచి దూరంగా వెళ్లిపోయిన కవిత.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత మళ్లీ భర్త వద్దకు వచ్చేసింది.
        కమల్‌కాంత్, హితేశ్ జైన్ బాల్యస్నేహితులు. ఇద్దరూ వ్యాపార కుటుంబాల నుంచి వచ్చినవారే. ఈ క్రమంలో కమల్‌కాంత్ తల్లి ఒక రోజు అకస్మాత్తుగా కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కమల్‌కాంత్ కూడా కడుపునొప్పితో బాధపడ్డాడు. ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. దీంతో ఆసుపత్రికి వెళ్లిన అతడిని పరీక్షించిన వైద్యులు అతడి రక్తంలో ఆర్సెనిక్, థాలియం స్థాయులు అధికంగా ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. మానవ శరీరంలో ఈ లోహాలు చేరడం అసాధారణమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ క్రమంలో బాంబే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబరు 19న కమల్‌కాంత్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత అకస్మాత్తు మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత అందులో కుట్ర దాగివున్నట్టు అనుమానించి కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కవిత, కమల్‌కాంత్ బాల్య స్నేహితుడు హితేశ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. బాధితుడి మెడికల్ రిపోర్టు, బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంతోపాటు కమల్‌కాంత్ తీసుకునే ఆహారం గురించి సేకరించిన విషయాలు కుట్రను బయటపెట్టినట్టు పోలీసులు తెలిపారు. హితేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత.. భర్త కమల్‌కాంత్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఒక్కసారిగా చంపేస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి.. ప్రియుడితో కలిసి భర్త తినే ఆహారంలో కొద్దికొద్దిగా విషం కలుపుతూ వచ్చింది. అది నెమ్మదిగా అతడి మృతికి కారణమైంది. కమల్ కాంత్ తల్లి కూడా కడుపు నొప్పితో బాధపడి మృతి చెందడంతో ఆమెకు కూడా స్లోపాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు  ప్రారంభించారు. అరెస్ట్ అయిన కవిత, హితేశ్‌లకు కోర్టు ఈ నెల 8 వరకు పోలీసు కస్టడీ విధించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య
హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్
రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...
ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌
కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!
హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో
ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక
నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
మోర్బీ బ్రిడ్జి ఘటనలో ఒరెవా గ్రూప్‌ ఎండీకి పోలీసుల కస్టడీ
పరీక్షా హాలులో స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి
అమెరికాలో మంచు వడగండ్ల వాన
జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం...ఇద్దరి మృతి
బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం...
నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు
లే ఆఫ్‌లకు బదులుగా ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమైన ‘ఇంటెల్’
పల్నాడులో టీడీపీ నేతపై కాల్పులు...
దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం
శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం
రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.