నవతెలంగాణ- రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్లో శనివారం చార్టర్డ్ విమానం కుప్ప కూలిపోయింది. ఈ తరుణంలో సాంకేతిక లోపం కారణంగానే చార్టర్డ్ విమానం కూలిందని అనుమానిస్తున్నారు. విమానం కూలిన సంఘటనస్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలివచ్చారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయ పునరావాస పనులు చేపట్టామని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.