Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హామీలు నెరవేర్చాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

హామీలు నెరవేర్చాలి

Sat 03 Dec 00:59:56.837473 2022

- అర్హత కలిగిన వారందరికీ డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలి
- సొంత స్థలం ఉన్న వారందరికీ ఐదు లక్షలు ఇవ్వాలి : పోతినేని, నున్నా
నవతెలంగాణ-ఖమ్మం
           అర్హత కలిగిన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో గ్రెయిన్‌ మార్కెట్‌ నుండి పాదయాత్ర నిర్వహించారు. తొలుత గ్రెయిన్‌ మార్కెట్‌ నుండి ప్రారంభమై గాంధీనగర్‌, రంగనాయకులు గుట్ట, పంపింగ్‌ వెల్‌ రోడ్డు, అభినవ్‌ స్కూల్‌, సుందరయ్య నగర్‌, ఎఫ్సీఐ రోడ్డు, ప్రకాష్‌ నగర్‌, బోసు సెంటర్‌ మీదుగా గ్రెయిన్‌ మార్కెట్‌ వద్ద పాదయాత్ర ముగిసింది. సిపిఎం ఖమ్మం 3 టౌన్‌ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో నున్నా మాట్లాడుతూ కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పుడు అర్హత కలిగిన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని, అలాగే గత ఎన్నికల ముందు సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని, కానీ ఇప్పుడు మూడు లక్షల మాత్రమే ఇస్తామని ప్రకటన చేయడం బాగాలేదన్నారు. వాగ్దానం చేసిన ప్రకారం ఐదు లక్షల రూపాయలను తప్పకుండా ఇవ్వాలని, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పేదలందరికీ ఇవ్వాలని, అలాగే రేషన్‌ కార్డులు, పెన్షన్లు కూడా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌, జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు బండారు యాకయ్య, 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎర్ర గోపి, 3 టౌన్‌ కార్యదర్శి వర్గ సభ్యులు పత్తిపాక నాగ సులోచన, షేక్‌ సైదులు, షేక్‌ హిమామ్‌, మండల కమిటీ సభ్యులు ఎస్కే బాబు, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, సారంగి పాపారావు, పోతురాజు జార్జి, చీకటిమల్ల శ్రీనివాసరావు, షేక్‌ మస్తాన్‌ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్‌ పరిధిలోని రేవతి సెంటర్‌ నుంచి తమిళ సెంటర్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో అర్హత కలిగినవారికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఖమ్మం నియోజకవర్గంలో పెండింగ్‌లో వున్నాయని, తెరాసా ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని, సొంత స్థలం వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ మూడు లక్షలు ఇస్తామని ఒకసారి, ఐదు లక్షలు ఇస్తామని ఒకసారి చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం ఇంతవరకు చిల్లిగవ్వ కూడా మంజూరు చేయలేదు అని విమర్శించారు. ఖమ్మం నగరంలో అర్హత కలిగినవారికి పెన్షన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారని, పెన్షన్లు విషయంలో రాజకీయ నాయకులు తల దూరుస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. గత కొన్ని సంవత్సరాలుగా రేషన్‌ కార్డులు ఇవ్వకుండా ఆన్లైన్‌ నమోదు పేరుతో కాలయాపన చేస్తున్నారని, వెంటనే రేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలపై తెరాసా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో నిరంతరం ప్రజాసమస్యలపై దశలవారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌, టూ టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, నాయకులు నర్రా రమేష్‌, ఆర్‌.ప్రకాష్‌, ఎండీ గౌస్‌, సిహెచ్‌.భద్రం, కె.వెంకన్న, బి.ఉపేంద్ర, జె.వెంకన్నబాబు, ఎన్‌.కుమారి, హుస్సేన్‌, వాసు, సూర్యం, రవీంద్ర, జలగం అనిల్‌ కుమార్‌, సాయి, కృష్ణవేణి, కనకదుర్గ, మల్లికార్జున్‌రెడ్డి, రాజేష్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.