Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నాడు స్కూల్‌ విద్యార్థిగా బహిష్కరణ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

నాడు స్కూల్‌ విద్యార్థిగా బహిష్కరణ

Fri 25 Nov 06:12:04.635859 2022

- నేడు అదే స్కూలుకు అతని నామకరణం
- నాటి జ్ఞాపకాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం 
- పసితనంలో స్వాతంత్రోద్యమం నుంచి చనిపోయే వరకు విప్లవ నాయకుడుగా...
ఆయనే హరి కిషన్‌ సింగ్‌ సూర్జీత్‌... గ్రామీణ ప్రజా ఉద్యమాలకు మార్గదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘానికి నిర్మాత : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌
న్యూఢిల్లీ : పసితనంలో జాతీయోద్యమ స్ఫూర్తితో ఉద్యమాల్లోకి దిగిన సూర్జీత్‌ ను స్కూలు యాజమాన్యం స్కూలు నుంచి బహిష్కరించిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ తెలిపారు. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ జిల్లా బండాల గ్రామంలో స్వాతంత్ర ఉద్యమ కాలంనాడే ఒక పాఠశాల ఉండేదని, అందులో హరి కిషన్‌ సింగ్‌ సూర్జీత్‌ విద్యాభ్యాసం చేశారని తెలిపారు. ఆ స్కూలును వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత బృందం, సీపీఐ(ఎం) నాయకులు సందర్శించారు. ఆ స్కూలు పరిసరాలను పరిశీలించిన వెంకట్‌ మాట్లాడుతూ జాతీయ ఉద్యమ కాలంలో బండాల స్కూల్లో చదువుకుంటున్న సూర్జీత్‌ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నారనే కారణంతో స్కూల్‌ నుంచి యాజమాన్యం బహిష్కరించిందని తెలిపారు. నేడు అదే స్కూలు ప్రధాన ద్వారానికి ఆయన పేరును నామకరణం చేసి ఆయన జ్ఞాపకాలన్నిటిని నేటి విద్యార్థి లోకానికి తెలియజేస్తున్నారనీ, సూర్జీత్‌ జ్ఞాపకాలని విద్యార్థుల్లో రగిలింపజేస్తున్నారని ఇది అత్యంత సంతోషకరమైన విషయమన్నారు.
జాతీయ ఉద్యమానికి ఊపిరిగా..
జాతీయ ఉద్యమ కాలంలో విద్యార్థులందరినీ ఉద్యమాలకు సమీకరించేందుకు ఆ స్కూల్లో ఉన్న స్కూల్‌ బెల్లును సూర్జీత్‌ వినియోగించేవారనీ, ఆయన జ్ఞాపకార్థం నేటికీ ఆ బెల్లును యధావిధిగా వినియోగిస్తున్నారని తెలిపారు. పసితనంలో స్వాతంత్ర పిపాసతో కదిలి.... జాతీయ ఉద్యమం ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చి, భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, కమ్యూనిస్టు ఉద్యమాలతో కడవరకు కొనసాగారని, సీపీఐ(ఎం) అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారని తెలిపారు. ఏఐకేఎస్‌ కు సుదీర్ఘకాలం అధ్యక్షులుగా పని చేశారనీ, వ్యవసాయ కార్మికుల యొక్క డిమాండ్స్‌ ను గుర్తించి, వారికి ప్రత్యేక సంఘం అఖిల భారత స్థాయిలో ఉండాలని భావించి 1982లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడేందుకు ఆయన చొరవ చేశారని, చివరి వరకు ఆ సంఘం జాతీయ కమిటీలో వుండి ఆయన పని చేశారని తెలిపారు.
స్వాతంత్య్రమంటే సమానత్వం, సామాజిక న్యాయం, సమాన హక్కులకోసం ..
స్వాతంత్రం అంటే ఈ దేశాన్ని విదేశీయులు కాకుండా స్వదేశీయులు పాలించుకోవడం మాత్రమే కాదని, అందరికీ సమానత్వం, సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధిం చబడాలని ఆయన కోరుకున్నారని తెలిపారు. పంజాబ్‌ లో ఆయన నాయకత్వంలో అనేక భూ పోరాటాలు, కూలి పోరాటాలు జరిగాయని, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని...
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న దశలో పార్లమెంట్లో ఆయన ప్రయివేట్‌ బిల్లును పెట్టారని, పాలకులు అటువంటి బిల్లును నేటికీ చట్టం చేయకపోవడం విచారకరమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి కారకులుగా వ్యవసాయ కార్మికులను పరిగణించాలని, ఎంతో విశ్లేషణాత్మకమైన అనేక గ్రంథాలను ఆయన రాసారని తెలిపారు. విద్యార్థి దశలో సూర్జిత్‌ యొక్క పోరాట పటిమను ఆనాటి నాయకత్వం ప్రశంసించిందని తెలిపారు. భగత్‌ సింగ్‌ మొదటి వర్ధంతిని జరపాలని జాతీయ ఉద్యమం పిలుపునిస్తే దానిని అమలు జరిపిన మొదటి వ్యక్తిగా సూర్జిత్‌ చరిత్రపుటల్లో నిలుస్తారని తెలిపారు.
సూర్జీత్‌ చదివిన చదువులమ్మ ఒడిలో...
బండాల స్కూలులోనే చదువుకొని గుర్తింపు పొందిన నాయకుల్లో సూర్జిత్‌ మొదటి వారైతే, అదే స్కూల్లో చదువుకున్న సర్దార్‌ దర్శన్‌ సింగ్‌ పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారని అనేకమంది విదేశాంగ మంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా ఆ స్కూలు నుంచి వచ్చారని, వారి అందరి పేర్లు స్కూలు గోడపై చెక్కారని తెలిపారు. గత సంవత్సరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ ఛెన్నీ ... సూర్జిత్‌ జ్ఞాపకాలు పొందుపరుస్తూ అనేక కార్యక్రమాలు చేశారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పంజాబ్‌ రాష్ట్ర పర్యటనలో భాగంగా సూర్జిత్‌ సొంత గ్రామంలో పర్యటించడం గొప్ప అనుభూతినిచ్చిందని వెంకట్‌ అన్నారు. సూర్జిత్‌ స్ఫూర్తితో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని మరింత అభివద్ధి చేయడం, హిందుత్వ కార్పొరేట్‌ శక్తులను ఓడించడమే ఆయనకు అర్పించే నివాళి అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదానికి గురైన సూర్జిత్‌ కుమారుడు గురు చరణ్‌ సింగ్‌ బాచి ని పరామర్శించినట్టు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.