Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నోట్లరద్దుపై కీలకపత్రాలను దాచేసింది | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

నోట్లరద్దుపై కీలకపత్రాలను దాచేసింది

Fri 25 Nov 06:12:12.512894 2022

- ఆర్‌బీఐ, కేంద్ర మంత్రివర్గం వద్ద పూర్తి సమాచారం లేదు
- సుప్రీంకోర్టు విచారణలో పి.చిదంబరం వాదనలు
- నేడు కొనసాగనున్న వాదనలు
న్యూఢిల్లీ : నోట్ల రద్దుపై కీలక పత్రాలను కేంద్రం దాచేసిందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరం పేర్కొన్నారు. ఆర్‌బీఐ, కేంద్ర మంత్రి వర్గం వద్ద పూర్తి సమాచారం లేదని స్పష్టంచేశారు. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై గురువారం జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బివి నాగరత్నలతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్‌ న్యాయవాది, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం రోజంతా వివరణాత్మక వాదనలు విపించారు. మొత్తం కరెన్సీలో 86 శాతం రద్దు చేస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదని అన్నారు. ''నవంబర్‌ 7న ఆర్‌బీఐకి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ముందు ఉంచిన ఎజెండా నోట్‌, సెంట్రల్‌ బోర్డ్‌ మీటింగ్‌ మినిట్స్‌, వారి సిఫార్సులు, నవంబర్‌ 8న కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం వంటి పత్రాలు ఇప్పటికీ లేవు. ఆరేండ్లు గడిచినా ఈ పత్రాలు ఇంకా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేదు'' అని చిదంబరం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్‌ 8న జరిగిన కీలకమైన సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశానికి ఎవరు హాజరయ్యారు? ఆర్‌బీఐ చట్టం-1934 ప్రకారం నిర్దేశించిన కనీస డైరెక్టర్ల సంఖ్య, రూపొందించిన నియమ నిబంధనలు వంటి వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పించుకుం దని తెలిపారు. 'పెద్ద నోట్ల రద్దు కసరత్తు మొత్తం దాదాపు 26 గంటల్లో జరిగింది. నవంబర్‌ 7న మధ్యాహ్నం తరువాత ఆర్‌బీఐకి లేఖ చేరింది. ఆ తరువాత నవంబర్‌ 8న ఢిల్లీలో సమావేశం కావాలని ఫోన్‌ ద్వారా సెంట్రల్‌ బోర్డ్‌ను పిలిచి ఉండవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు సమావేశమై, గంట, గంటన్నరలోపు ఆ సిఫార్సును అందజేశారు. తరువాత ప్రధాని రాత్రి 8 గంటలకు టెలివిజన్‌లో ప్రకటించారు' అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చట్టబద్ధమైన పాలనను అపహాస్యం చేసే అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్‌బీఐ కానీ తమ కౌంటర్‌ అఫిడవిట్‌ల్లో నిర్ణయం తీసుకునే ప్రక్రియకు సంబంధించి మెటీరియల్‌ వివరాలను అందించలేదని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.