Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గర్జించిన రైతన్న | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

గర్జించిన రైతన్న

Sun 27 Nov 04:10:00.769441 2022

- రాజ్‌భవన్లకు మార్చ్‌లో 50 లక్షల మంది
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ర్యాలీలు
- రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎనిమిది డిమాండ్లతో వినతి
- రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వంపై అన్నదాత ఆగ్రహం
- మలిదశ పోరాటానికి నాంది : రైతు నేతలు
          దేశంలోని రైతన్నలు మరోసారి గర్జించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు రైతు నినాదాలతో దద్దరిల్లాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపులో భాగంగా రాజ్‌భవన్‌ల మార్చ్‌ శనివారం దిగ్విజయంగా జరిగింది. ఈ మెగా నిరసనలో మిలియన్ల మంది రైతులు పాల్గొన్నారు. ఎస్‌కేఎం పిలుపుకు రైతులతో పాటు కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, సామాన్య ప్రజలు రాష్ట్రాల రాజధానుల్లో భారీ పాదయాత్రలు, ర్యాలీ, కవాతులు నిర్వహించారు. 25 రాష్ట్రాల రాజధానుల్లో 300లకు పైబడి జిల్లా కేంద్రాల్లో, వేలాది మండల కేంద్రాల్లో భారీ సభలు జరిగాయి. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.
న్యూఢిల్లీ : ఎస్‌కేఎం రాజ్‌భవన్‌ మార్చ్‌ల్లో పాల్గొనేందుకు ఐదు మిలియన్లకు పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చండీగఢ్‌, లక్నో, పాట్నా, కోల్‌కతా, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్‌, భోపాల్‌, జైపూర్‌, విజయవాడ, అగర్తలా, దిస్‌పూర్‌, ముంబాయి, రాంచీ, పనాజీతో పాటు అనేక ఇతర రాష్ట్ర రాజధానుల్లో లక్షలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో 40 వేల మందితో భారీ ర్యాలీ జరిగింది. రాజ్‌భవన్‌ వైపుగా వెళ్తన్న ర్యాలీని చండీగఢ్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది. ఎస్‌కేఎం నేతలు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. సభలో అశోక్‌ ధావలే, జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, దర్శన్‌ పాల్‌, బూటా సింగ్‌ బుర్జ్‌గిల్‌, బల్దేవ్‌ సింగ్‌ నిహల్‌గర్‌, రుల్దు సింగ్‌ మాన్సా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో భారీ కిసాన్‌ ర్యాలీ జరిగింది. అనంతరం ఎకో మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో హన్నన్‌ మొల్లా, రాకేష్‌ టికాయిత్‌ తదితరులు మాట్లాడారు.
మలిదశ పోరాటానికి నాంది
సామూహిక బలంతో భారీ ప్రదర్శన, రైతుల అన్ని డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. 2020 నవంబర్‌ 26న ఎస్‌కేఎం చారిత్రాత్మకమైన ''ఢిల్లీ చలో'' ఉద్యమాన్ని ప్రారంభించిందనీ, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రైతు ఉద్యమంగా అవతరించిందని తెలిపారు. రైతులను వారి భూమి నుంచి గెట్టివేసేందుకు కుట్రలు పన్నిన కార్పొరేట్‌, రాజకీయ బంధానికి వ్యతిరేకంగా రైతుల అద్భుతమైన విజయానికి దారితీసిందని తెలిపారు. రెండేండ్ల తర్వాత అదే రోజున దేశవ్యాప్తంగా ''రాజ్‌ భవన్‌ మార్చ్‌లు' నిర్వహించామని తెలిపారు. ఇది రైతుల మలిదశ పోరాటానికి నాందని స్పష్టం చేశారు. 'రాజ్‌భవన్‌ మార్చ్‌ల' కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, పౌర సమాజానికి ఎస్‌కేఎం నేతలు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరంతరం, నిబద్ధతతో కూడిన దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గర్జించారు. రాష్ట్రపతికి, రాష్ట్రాల గవర్నర్లకు రైతుల డిమాండ్లతో కూడిన మెమోరాండం పంపారు. కేంద్రంలోని అధికార పార్టీ రైతు వ్యతిరేక విధానాలను జోక్యం చేసుకుని ఆపాలని కోరారు.
ఎనిమిది డిమాండ్లతో వినతలు
1. రైతులందరికీ అన్ని పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి. 2. సమగ్ర రుణమాఫీ పథకంతో రుణభారం నుంచి రైతులకు విముక్తి కల్పించాలి. 3. విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలి. 4. లఖింపూర్‌ ఖేరి రైతుల, జర్నలిస్ట్‌ మారణకాండలో నిందితుడైన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్‌ టెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయనను పదవి నుంచి తొలగించాలి. 5. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు త్వరగా పరిహారం అందించేందుకు సమగ్ర, ప్రభావవంతమైన పంటల బీమా పథకం తీసుకురావాలి. 6. సన్నకారు, చిన్న, మధ్య తరహా రైతులు, వ్యవసాయ కార్మికులందరికీ నెలకు రూ. 5,000 రైతు పింఛను ఇవ్వాలి. 7. రైతు ఉద్యమంలో రైతులపై నమోదైన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. 8. అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి'' అని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు రైతుల ఉద్యమ సమయంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్ని స్థానిక డిమాండ్లను కూడా లేవనెత్తారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.