Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వారి త్యాగాలకు గుర్తింపేది? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

వారి త్యాగాలకు గుర్తింపేది?

Wed 30 Nov 02:55:09.54637 2022

- స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రొఫైల్స్‌తో లాస్ట్‌ హీరోస్‌ పుస్తకం
- జీవించివున్న వారికి కేంద్రం సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు..
- వలస పాలన దురాగతాలు ఈ తరానికి తెలవాలి కదా : పుస్తక రచయిత పి.సాయినాథ్‌
న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించలేదని, వారిని సమున్న తంగా గౌరవించటంలో, గుర్తించటంలో మోడీ సర్కార్‌ చాలా సంకుచితంగా వ్యవహరిస్తోందని ప్రముఖ జర్నలిస్టు, మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్‌ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 'లాస్ట్‌ హీరోస్‌' అనే పేరుతో ఆయన పుస్తకాన్ని విడుదల చేశారు. దాదాపు 10ఏండ్లకు పైగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, స్వాతంత్య్ర సమరయోధులను ఆయన ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నారు. వీరి ప్రొఫైల్‌, పోరాట వివరాల్ని తెలియజేస్తూ 'లాస్ట్‌ హీరోస్‌' పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. సోమవారం న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి.సాయినాథ్‌ మాట్లాడుతూ..పోరాట యోధులకు ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు దక్కలేదని, ప్రస్తుతం జీవించి వున్న (లాస్ట్‌ హీరోస్‌) ఆనాటి పోరాట యోధులను ఈ తరానికి తెలపాలన్న ప్రయత్నం కూడా పాలకులు చేయలేదని ఆయన తప్పుబట్టారు. రెండు వందల ఏండ్లకుపైగా వలస పాలతనో ధ్వంసమైన భారతదేశం గురించి ఈ తరానికి తెలపాలన్న ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
           నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మల్లు స్వరాజ్యం, 1943-46లో మధ్యకాలంలో మహారాష్ట్రలో ఎత్తుకెళ్లిన ఆయుధాలతో బ్రిటీష్‌ కార్యాలయాలపై దాడులు చేసిన హోసబాయి పాటిల్‌ ప్రొఫైల్‌ను 'లాస్ట్‌ హీరోస్‌'లో సాయినాథ్‌ పొందుపర్చారు. లాఠీలతో సాయుధ బ్రిటీష్‌ అధికారులపై దాడి చేసిన దేమత దేరు సబర్‌, ఆమె సహచరులు, సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో సైనికులకు వంటవాడుగా పనిచేసిన లక్ష్మీ పాండా మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాశారు.
సావార్కర్‌కు మిగతా వారికి తేడా అదే..
           నేటి హిందూత్వ వాదుల ఐకాన్‌ అయిన వి.డి.సావార్కర్‌ గురించి సాయినాథ్‌ చెబుతూ..''దయ చూపి విడుదల చేయాలని వి.డి.సావార్కర్‌ సహా అనేకమంది బ్రిటిషర్లకు దరఖాస్తు చేసుకున్నారు. క్షమాభిక్షతో విడులయ్యాక.. వి.డి.సావార్కార్‌ బ్రిటిషర్లతో చేతులు కలిపాడు. మిగతావారు మాత్రం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదీ తేడా..!'' అని వివరించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జీవించి ఉన్న ఎంతోమంది మహిళలు, పురుషులు దేశవ్యాప్తంగా ఉన్నారని, వారిని కేంద్రం గుర్తించిన తీరు, వర్గీకరించిన తీరు దారుణమని, వారి త్యాగాలకు అధికారిక గుర్తింపు లభించలేదని సాయినాథ్‌ వాపోయారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటికీ, ఆ పోరాటం ఇంకా పూర్తికాలేదని తన ఇంటర్వ్యూలో అనేకమంది మహిళలు, పురుషులు చెప్పారని, 16మంది స్వాతంత్య్ర పోరాటయోధుల్లో కేవలం ఆరుగురు మాత్రమే ఇప్పటికీ సజీవంగా ఉన్నారని చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.