Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
తగ్గేదేలే...! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

తగ్గేదేలే...!

Wed 30 Nov 02:55:22.771435 2022

- వివాదాస్పదమౌతున్న కేంద్ర ప్రభుత్వ పెట్రో విధానం
- పది నెలల కనిష్టానికి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు
- కార్పొరేట్ల లాభాలే ముఖ్యమంటున్న సర్కారు
న్యూఢిల్లీ : దేశంలో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, డాలర్‌ బలపడటమంటూ అనేక కారణాలు చెబుతూ సామాన్యుడి నడ్డి విరగకొడుతున్న కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల విషయంలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గుతున్నా దాని ప్రయోజనాలను సామాన్యులకు అందకుండా చేస్తోంది.
ఒకటి, రెండూ కాదు దాదాపు ఏడాది నుండి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా పదినెలల కనిష్టానికి చేరాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చిలో బ్యారెల్‌ (159 లీటర్లు) ధర 112.87 డాలర్లుగా గా ఉండగా, నవంబర్‌కు 88.66 డాలర్లకు పడిపోయింది. ఈ స్థాయిలో ధర పతనం అయినప్పటికీ సామాన్య ప్రజలకు పది రూపాయల ప్రయోజనం కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడటం లేదు. 'మరికొంత కాలం ధరలు ఇలానే ఉంటాయి...' అని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేంద్రం వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.
అంతర్జాతీయంగా ఇలా ..
ఆర్థిక వ్యవస్థ మంద గమనం భయాలు కొంత కాలంగా ప్రపంచాన్ని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఆగస్టు నుండి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఎంతో కొంత తగ్గుతూనే ఉన్నాయి. జులైలో బ్యారెల్‌ ధర 105.49 డాలర్లగా ఉండగా, ఆగస్టులో రూ. 97.40కి,. సెప్టెంబర్‌లో రూ. 90.71కి తగ్గింది. అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగి 91.70కి స్వల్పంగా పెరిగినప్పటికీ నవంబర్‌లో 88.66 డాలర్లకు పడిపోయింది.
ఇది ఈ ఏడాది జనవరి నెలలో ఉన్నధరలతో దాదాపు సమానం. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం ఈ స్థాయి ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు. కేసులు ఇదే మాదిరి కొనసాగితే చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఈ పరిస్థితికి కారణం.
దేశంలో ఎందుకు తగ్గడం లేదు?
పెట్రోల్‌, డీజిల్‌ రిటల్‌ ధరలో సగం కన్న ఎక్కువ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులేనన్న విషయం తెలిసిందే. ఎక్సైజ్‌ సుంకం ద్వారానే కేంద్ర ఖజానాకు లక్షల కోట్లు సమకూరుతున్నాయి. సెస్‌లు దానికి అదనం. కాగా పెట్టుబడిదారీ ఆర్థిక సూత్రాల ప్రకారం అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో, రిటైల్‌ మార్కెట్‌లోనూ తగ్గాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో మరి కొంత కాలం రిటైల్‌ షాపుల వద్ద భారీ ధరలు కొనసాగనున్నాయి.
ఆలోగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితిపై పెట్రోలియం శాఖ అధికారులు స్పందిస్తూ 'రిటైల్‌ మార్కెట్‌లో ధరలు తగ్గించడానికి ముందే ఆయిల్‌ కంపెనీలు సంపాదించుకోవాల్సిఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగినా మన దేశంలో ఆయిల్‌ కంపెనీలు అప్పట్లో ధరలు పెంచలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నష్టాన్ని ఆ సంస్థలు భర్తీ చేసుకునేలా చూడాలి. అదే సమయంలో ధరల తగ్గుదల దీర్ఘకాలం కొనసాగుతుందా, లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి' అని చెప్పారు. అయితే, కంపెనీలు నష్టపోయిన మొత్తాన్ని జులై, ఆగస్టు నెలలకే కంపెనీలు భర్తీ చేసుకుని ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయినా, అధికారులు చెబుతున్న ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే పెట్రో ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని స్పష్టమౌతోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.