Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
విద్యా..ఉద్యోగాలేవి? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

విద్యా..ఉద్యోగాలేవి?

Wed 30 Nov 02:55:48.950344 2022

- ఉత్తర గుజరాత్‌లో ఎస్టీల పరిస్థితి దయనీయం
న్యూఢిల్లీ : సరైన విద్యా, ఉద్యోగ అవకాశాల్లేక గుజరాత్‌లో గిరిజనులు (ఎస్టీ) అల్లాడిపోతున్నారు. సుదీర్ఘకాలంగా స్థిరమైన ప్రభుత్వమున్నా, అధికార బీజేపీ వారి సంక్షేమం, అభివృద్ధికి పాటుపడలేదనే విమర్శలున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాలు, ఆవాసాలు..నిరక్షరాస్యత, ఎనీమియా, నిరుద్యోగానికి నిలయంగా మారాయని, వీటి నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున వలసలు చోటుచేసుకుంటాయని సమాచారం. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో 89 నియోజికవర్గాల్లో గిరిజనుల ఓటు నిర్ణయాత్మకంగా మారుతోంది.
ముఖ్యంగా డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరగనున్న దక్షిణ గుజరాత్‌లోని స్థానాల్లో గెలుపు బీజేపీ, కాంగ్రెస్‌లకు అత్యంత కీలకం. ఇక్కడి 35 నియోజికవర్గాల్లో ఎస్టీ ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. వీరి మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారానికి చేరువ కాలేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
విద్యా, ఉద్యోగ అవకాశాల్లేవి?
సూరత్‌, డాంగ్‌, తపీ, భారూచ్‌, వల్సాద్‌, నర్మదా, నవశ్రీ జిల్లాల్లోని 15 తాలూకాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో 14.67శాతమున్నారని తేలింది. దాదాపు 75లక్షల మంది ఉంటారని అంచనా. ఈ దశాబ్దకాలంలో ఆ జనాభా మరింత పెరిగివుండవచ్చు. బీజేపీ పాలనలో మొదట్నుంచీ ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కటం లేదు. నాణ్యమైన విద్య అందుబాటులో లేదు. దాంతో సరైన ఉపాధి అవకాశాలు దక్కటం లేదు. అసంఘటిత రంగంలో వలస కూలీగా మారుతున్నారు. ఉన్నత విద్య లేకపోవటం వల్లే ఉపాధి సమస్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోని సేయింట్‌ జేవియర్‌ కాలేజీ విడుదల చేసిన ఒక స్టడీ ప్రకారం, దక్షిణ గుజరాత్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఎస్టీలు 11శాతం, పీజీ చదివినవారు 4శాతం ఉన్నారని తేలింది. దక్షిణంతో పోల్చితే ఉత్తర గుజరాత్‌లో ఎస్టీల పరిస్థితి దయనీయం. ఉన్నత విద్యలో వారి ప్రాతినిథ్యం ఒక్క శాతం కూడా లేదు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, అధిక వలసలు..ఎక్కువగా ఉన్నాయి. అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దక్షిణ గుజరాత్‌కు చెందిన గిరిజనులకు ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కటం లేదు. తపీ, నర్మదా నదులపై పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టడం గిరిజనుల్లో అధిక వలసలకు దారితీసింది.
ఉన్న..ఉద్యోగం పోయింది : సతీశ్‌భాయ్‌ బోయే, బోర్‌ఖాల్‌ గ్రామం
ఐటీఐ పూర్తిచేసి రాజ్‌కోట్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్‌ లేబర్‌గా చేరాను. కోవిడ్‌-19 తర్వాత ఉన్న ఉద్యోగం పోయింది. స్థానికంగా ఒక న్యాయవాది వద్ద కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. మా కుటుంబంలో అందరూ చదువుకున్నారు. తమ్ముడు ఎం.ఎ, బి.ఎడ్‌ చేశాడు. చెల్లెలు నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. గత ఐదేండ్లలో ఉద్యోగ పరీక్షల్లో పేపర్‌ లీకేజ్‌ లపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ పాలకుల పట్ల గిరిజన సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా...27ఏండ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.