Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మూడు ప్రాజెక్టులకు ఆమోదం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

మూడు ప్రాజెక్టులకు ఆమోదం

Wed 30 Nov 04:04:09.246881 2022

- కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో నిర్ణయం
- తెలంగాణకు త్వరలో టీఏసీ మినిట్స్‌ జారీ..
న్యూఢిల్లీ : తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు సాంకేతిక సహాల కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఛనాక కోరాట బ్యారేజి, నిజామాబాద్‌ జిల్లాలోని చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబందించి టీఏసీ మినిట్స్‌ త్వరలోనే జారీ చేయనున్నారు. 2021 జులైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మూడు ప్రాజెక్టులను ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను 2021 సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకుషంగా పరిశీలించి ఆమోదాన్ని తెలిపియి. ఆ తరువాత డీపీఆర్‌ల పరిశీలనకు సంబందించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్‌ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. 2022 ఏప్రిల్‌లో జరిగిన 13వ బోర్డు మీటింగ్‌లో చర్చకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా బోర్డు తమ రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపించింది. ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తిన అన్నీ అభ్యంతరాలను కేంద్ర జల సంఘం పున: సమీక్షించి, వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు (టీఈసీ) ఇవ్వవచ్చునని సిఫారసు చేస్తూ టీఏసీకి పంపింది. సోమవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులపై సవివరమైన చర్చ జరిగింది. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్టు చైర్మెన్‌ పంకజ్‌ కుమార్‌ ప్రకటించారు. త్వరలోనే మినిట్స్‌ జారీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రెటరీ దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం చైర్మెన్‌ ఆర్‌.కె గుప్త, సభ్యులు చంద్రశేఖర అయ్యర్‌, రుష్విందర్‌ వోర, కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీర్లు పైథాంకర్‌, బి పి పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రజత కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు సి. మురళీధర్‌, ఎన్‌. వెంకటేశ్వర్లు(రామగుండం), చీఫ్‌ ఇంజనీర్లు శ్రీనివాస్‌ (ఆదిలాబాద్‌), మధుసూధన్‌ (నిజామాబాద్‌ ), సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.